డి శ్రీనివాస్ తెలంగాణపై ఏం చెబుతారు?
కాంగ్రెస్ తెలంగాణ పై తన నిర్ణయాన్ని తెలంగాణకు అనుకూలంగా చెబుతుందా, వ్యతిరేకంగా చెబుతుందా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ అభిప్రా యం చెప్పాలని కమిటీ సూచించింది. దీంతో అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులా? జాతీయ అధ్యక్షులా? అనే అయోమయ పరిస్థితి కాంగ్రెస్లో నెలకొన్నది. ఒక వేళ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఇప్పటికే తెలంగాణ వాదిగా ముద్రపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన తెలంగాణకు అనుకూలంగా, వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పినా ఇబ్బందులు తప్పవు. లేదంటే ఏఐసీసీ అధ్య క్షురాలు సోనియా గాంధీ పార్టీ అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి తెలియజేయాలి. అలా కాకుండా పీసీసీ అధ్యక్షుడు డీఎస్ తోనే ఆమె పార్టీ అభిప్రాయం కమిటీకి చెప్పిస్తారా అనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
జాతీయ పార్టీల రాష్ట్ర అధ్య క్షులుగాని, జాతీయ అధ్యక్షులుగాని ఎవరో ఒకరు పార్టీ అభిప్రాయా న్ని తెలియజేయాలని శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీ దుగ్గల్ గురువారం ఢిల్లీలో స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ వైపు నుంచి సోనియా, డీఎస్ లలో ఎవరో ఒకరు కమిటీకి పార్టీ అభిప్రాయం తెలియ జేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో డీఎస్ మాత్రం ఆసక్తి చూపించడం లేదనే విషయం ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు పేర్కొ న్నాయి.