జగన్, చంద్రబాబు: టాస్ వేస్తున్న అఖిలేష్

Akilesh Yadav - YS Jagan
జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్న ఉత్తరప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి టాస్ వేస్తున్నారు. ఒక రకంగా ఆప్షన్‌ను ఉంచుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో తృతీయ కూటమిని బలోపేతం చేసి, తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు అవసరమైన రాజకీయాలను ఆయన నడపడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. లోకసభకు మధ్యంతర ఎన్నికల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, 2014లోనే ఎన్నికలు జరుగుతాయని అఖిలేష్ యాదవ్ అంటున్నారు.

వచ్చే లోకసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్, నారా చంద్రబాబు నాయుడుల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారితో దోస్తీ చేయడానికి అవసరమైన వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జగన్, చంద్రబాబు - ఇద్దరూ తమకు మిత్రులేనని, వారిలో ఎవరితో జత కడుతామనేది ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన అంటున్నారు. అవసరమైతే ఇద్దరితోనూ జత కట్టే వ్యూహాన్ని కూడా ఆయన అమలు చేయవచ్చునని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+