వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చోరీ ఖైదీల మధ్య విజయ సాయి రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టైన జగతి బ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని మరో ముగ్గురు చోరీ ఖైదీలతో కలిపి చంచల్ గూడ జైలులో ఉంచారు. ఆయనను జైల్లో నాలుగో నంబర్ బ్యారక్‌లో ఉంచారు. విజయ సాయి రెడ్డిని కలిసేందుకు జగన్‌కు చెందిన సాక్షి ప్రతినిధులు వచ్చినప్పటికీ అనుమతించలేదట. మరోవైపు విచారణలో సిబిఐకి విజయ సాయి రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. అరెస్టుకు ముందు ఆయనను పలుమార్లు విచారణ చేసిన సిబిఐ ఏమాత్రం పూర్తి సమాచారాలు రాబట్టలేక పోయింది. తమ కస్టడీకి తీసుకున్న తర్వాతైనా ఏమైనా రాబట్టాలనుకున్న సిబిఐకు మళ్లీ విజయ సాయి చుక్కలు చూపిస్తున్నారట.

విజయ సాయిని కోర్టు ఐదురోజుల సిబిఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. గురువారం ఆయనను సిబిఐ విచారించింది. అయితే ఎన్నిసార్లు ఎన్నివిధాలుగా ప్రశ్నించినా ఆయన మాత్రం అంతా చట్టబద్దంగానే జరిగిందని, ఎక్కడా ఉల్లంఘన జరగలేదని చెబుతున్నారట. అయితే గతంలోనే పలుమార్లు ఆయనను విచారించడంతో ఆయన గురించి తెలిసిన సిబిఐ అధికారులు ఏమాత్రం ఆశ్చర్యపోలేదట. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదు రోజుల కస్టడీలో ఆయన నుండి పలు వివరాలు రాబట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. కాగా విజయ సాయి అరెస్టైన రోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో గురువారం సిబిఐ విచారణకు హాజరైన సమయంలోనూ అంతే ఉత్సాహంగా కనిపించారు.

English summary
Jagathi Publications vice chairman Vijaya Sai Reddy sharing room with three robbery prisoners in Chanchalguda jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X