జగన్ కేసులోకి చంద్రబాబు పేరు లాగిన రాంకీ

రాంకీ ఫార్మాసిటి లే అవుట్కు అనుమతులు వచ్చాయని, ఆ వెంటనే జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని ఈడి తెలిపింది. ఫార్మాసిటికీ ఇచ్చిన భూములపై రాంకీ గ్రూపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి బుకాయించాలని చూసింది. ఫార్మాసిటికీ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూములు కేటాయించారని, దీనికి వైయస్ రాజశేఖర రెడ్డితో ఎలాంటి సంబంధం లేదని రాంకీ ఫార్మా వాదించింది. దీనిని ఈడి కొట్టివేసింది.
ఫార్మా సిటి ప్రతిపాదన బాబు పాలనలో చివరిలో ప్రాణం పోసుకున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో రూపురేఖలు సంతరించుకున్నది మాత్రం వైయస్ హయాంలో మాత్రమేనని, జగన్ తండ్రిపై పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వానికి నష్టాన్ని చేకూర్చారని, ప్రారంభం కాబోయే తన కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసి ముడుపులను పెట్టుబడుల రూపంలో ముట్టజెప్పిన వారికే ప్రాజెక్టుల ద్వారా లబ్ధి చేకూర్చారని ఈడి పేర్కొంది.
2003-04లో వైయస్ జగన్ చూపిన ఆదాయానికి, 2009 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పొందుపర్చిన ఆస్తులకు అసలు పొంతనలేదని న్యాయప్రాధికారిక సంస్థ పేర్కొంది. జగన్ 2003-04లో ఐటి రిటర్న్స్లో తన వార్షిక ఆదాయాన్ని రూ.9,19,951గా చూపారని, 2009 నాటి ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విలువను రూ.77.40 కోట్లుగా పేర్కొన్నారని ఈడి తెలిపింది.
-
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications