బాయ్ ఫ్రెండ్తో వెళ్లిన నటి సాయి శిరీష?
సాయి శిరీష షూటింగ్కని చెప్పి మేలో వెళ్లిందని, ఇప్పటి వరకు రాలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రికి చెందిన సాయి శిరీష (18) ఇప్పుడిప్పుడే సినిమాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చాలా కాలంగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాదులోని కృష్ణానగర్లో ఉంటున్నారు.
ఆమె కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించింది. లవ్ అటాక్ అనే సినిమాలో నటిస్తోంది. మే 27వ తేదీన శిరీష్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాను జులై 6వ తేదీ తన కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు శిరీష తండ్రి ప్రసాదరావు పోలీసులకు చెప్పారు. త్వరలోనే ఇంటికి వస్తానని కూతురు తనకు చెప్పినట్లు తెలిపారు.
అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడలేదని అంటున్నారు. తన కూతురికి ఏమైనా జరిగిందేమో అనుమానంతో ప్రసాదరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె ఎక్కడుందనే విషయాన్ని కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.