దావూద్ కారు తగులబెట్టారు,అవశేషాలతో మరుగుదొడ్డి
లక్నో: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కారుకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి బుధవారం నాడు బహిరంగంగా నిప్పుబెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఘజియాబాద్లోని ఇందిరాపురంలో ఈ కారును ఆయన తగులబెట్టారు.
కారు ముందు భాగంలో దావూద్ ఫొటోలను ఉంచి, కారు లోపల, బయట కట్టెలు పేర్చారు. అనంతరం చక్రపాణి దానికి నిప్పును అంటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. కారు దగ్ధంతో తీవ్రవాదానికి అంత్యక్రియలు జరిపామన్నారు. ఇది తీవ్రవాదం వద్దని చెప్పడానికి ఓ సందేశం అన్నారు.

దావూద్ ఇబ్రహీం వాడిన ఎంహెచ్04-ఏఎక్స్3676 అనే నంబరు గల హ్యుందాయ్ యాక్సెంట్ గ్రీన్ కలర్ కారును కొద్ది రోజుల క్రితం జరిగిన వేలం పాటలో చక్రపాణి దక్కించుకున్నారు. దానిని తొలుత అంబులెన్సుగా ఉపయోగించాలనుకున్నారు.
ఓ వ్యవసాయ క్షేత్రంలో బహిరంగంగా ప్రజల సమక్షంలో చక్రపాణి దానిని తగులబెట్టారు. వేలం పాటలో ఈ కారును అతను రూ.32వేలకు సొంతం చేసుకున్నారు. కాగా, తగులబెట్టగా మిగిలిన అవశేషాలతో మరుగుదొడ్డి నిర్మించాలనుకుంటున్నట్లు స్వామి చక్రపాణి చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications