తెలంగాణ టిడిపికి జూ. ఎన్టీఆర్ లేదా బ్రాహ్మణి: బాబు చాయిస్?
Recommended Video

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ముందు తెలంగాణ పార్టీ కార్యకర్తలు అనూహ్యమైన డిమాండ్లు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలనేది ఆయన డిమాండ్.
జూనియర్ ఎన్టీఆర్కు లేదా నారా బ్రాహ్మణికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలంగాణ పార్టీ నాయకుల నుంచి కొంత కాలంగా డిమాండ్ వస్తోంది. అదే బుధవారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ప్రతిఫలించింది.

ప్రతిపాదనను నారా లోకేష్ ముందు
పార్టీ బాధ్యతలు నారా బ్రాహ్మణికి లేదా జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలని మీడియా ముఖంగా కూడా కోరారు. తాజాగా అదే ప్రతిపాదనను చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ముందు పెట్టారు. తాజాగా అదే డిమాండును చంద్రబాబు ముందు పెట్టారు.

రెండు పేర్లు చెప్పి చాయిస్...
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రెండు పేర్లు చెప్పి చంద్రబాబుకే చాయిస్ ఇచ్చారు అయితే, ఆ ప్రతిపాదనలపై చంద్రబాబు ఆసక్తి కనబరిచినట్లు లేరు. తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమేనని, ఇటువంటి స్థితిలో ఆ విధమైన డిమాండ్లు రావడం సహజమేనని అన్నారు. అంతకు మించి ఆయన మాట్లాడలేదు.

చంద్రబాబుకు ఇష్టం లేదు...
నారా బ్రాహ్మణికి గానీ జూనియర్ ఎన్టీఆర్కు గానీ తెలంగాణ పార్టీ పగ్గాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని తెలుస్తోంది. తెలంగాణలో తన కుటుంబ సభ్యులను దించకూడదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

ప్రత్యామ్నాయం ఏమిటి...
తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో పొత్తుల ద్వారా క్యాడర్ను, స్థానిక నాయకత్వాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకుని అవసరమైతే ఆ తర్వాత ప్రభుత్వంలో చేరాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉన్నట్లు తెలుస్తోంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications