ఇడ్లీ vs దోశ.. ఈ రెండింటిలో ఎవరికి ఏది బెస్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో అల్పాహారాల్లో ఇడ్లీ లేదా దోశ కామన్. రెండూ పులియబెట్టిన పిండితో తయారు చేసినవే. ఈ రెండిటి ఆకృతి, రుచిలో కొంత భిన్నంగా ఉంటాయి. ఇడ్లీని పూర్తిగా ఆవిరిపై ఉడికిస్తారు.. ఇక, పెనంపై నూనెతో కాల్చిన దోశలు క్రిస్పీగా, కలర్ఫుల్ గా నోరూరిస్తూ ఉంటాయి. రుచిలోనూ దేని ప్రత్యేకత దానిదే. కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ బెస్ట్ అని చెబుతూ ఉంటారు. అయితే, దోశ ను ఇష్టపడే వారు ఉన్నారు. ఈ రెండింటిలో హెల్తీ ఫుడ్ ఏదనే చర్చ ఉంది. ఎవరికి ఏది మంచిదో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ఇడ్లీ.. దోశ దాదాపుగా ప్రతీ ఇంటా ఉంటాయి. అయితే, ఈ రెండింటి వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాల పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇడ్లీలను ఆవిరిపై ఉడికించడం వల్ల అవి ఏ మాత్రం నూనెను పీల్చుకోవు. దీనికి విరుద్ధంగా, దోశలను సాధారణంగా క్రిస్పీగా మారడానికి నెయ్యి లేదా నూనెతో పాన్-ఫ్రై చేస్తారు. దీని వలన వాటి కేలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. అదే విధంగా పులియబెట్టిన పిండితో చేసే ఇడ్లీలు ప్రక్రియ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పోషకా ల శోషణను పెంచుతుంది. అన్ని వయసుల వారికి ఇడ్లీలను ఆరోగ్యకరమైన ఎంపిక. ఇడ్లీలు సుల భంగా జీర్ణమవుతాయి. వ్యాయామం తర్వాత తినేందుకు బెస్ట్ ఫుడ్. ఇవి జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలిగించకుండా అవసరమైన శక్తి, పోషకాలను అందిస్తాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇడ్లీ మంచి ఎంపిక. ఇడ్లీలోని కిణ్వ ప్రక్రియ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలను తగ్గిస్తుంది.

ఆరోగ్య పరంగా ప్రయోజనాలు.. పరిమితి
అదే విధంగా దోశలు తిన్న తర్వాత కడుపు నిండినట్లుగా అనిపించడమే కాక సంతృప్తిగానూ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్-రిచ్ లేదా ఫైబర్-రిచ్ ఫిల్లింగ్లతో కలిపి తీసుకుంటే. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారి ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. దోశల్లో వివిధ రకాలు ఉంటాయి. వీటి తయారీకి వివిధ రకాల కూరగాయలు, ప్రోటీన్లను జోడించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైనన్ని పోషకాలతో తయారుచేసుకునే సౌలభ్యం ఉంటుంది. దోశలు అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇది అల్పాహారం లేదా వ్యాయామానికి ముందు తింటే స్థిరమైన శక్తి లభిస్తుంది. ఇతర ఆహారపదార్థాల తో పోలిస్తే మంచి ఎంపిక. ఇడ్లీ, దోశల్లో ఏది ఎంచుకోవాలనే ప్రశ్న వస్తే, అది ఆయా వ్యక్తుల ఆరోగ్యకర స్థితి, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కడుపుకు మృదువుగా ఉండే తేలికైన, తక్కువ కొవ్వు భోజనం కోసం చూస్తున్నట్లయితే ఇడ్లీ తినడం మంచిది. అలాకాక, కడుపు నిండిన అనుభూతి, రుచి రెండూ కావాలని కోరుకునేవారికి తక్కువ నూనెతో చేసిన దోశ బెస్ట్ ఛాయిస్. ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీలతో కలిపి తింటే ఇడ్లీ, దోశ రెండూ పోషకాహారాలే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications