పరిమళ్ నత్వానీ గెలుపు వెనుక, సాయిరెడ్డి బిగ్ ఆపరేషన్..!?

విజయ సాయిరెడ్డి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. వైసీపీకి రాజీనామాతో పాటుగా రాజకీయం గా దూరంగా ఉంటున్న సాయిరెడ్డి ఇప్పుడు జార్ఖండ్ కేంద్రంగా చర్చగా మారారు. జార్ఖండ్ నుంచి పరిమళ్ నత్వానీ అనూహ్యంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధిని కాదని.. పరిమళ్ నత్వానీ గెలుపు లో సాయిరెడ్డి పాత్ర పైన రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. నత్వానీ గెలుపు కోసం సాయిరెడ్డి ఆపరేషన్ కీలకంగా మారిందని చెబుతున్నారు.

జగన్ సీఎం అయిన తరువాత పరిమళ్ నత్వానీ ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. వైసీపీ కోటాలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇప్పుడు తిరిగి అవకాశం దక్కలేదు. దీంతో, మరోసారి జార్ఖండ్ నుంచి పోటీకి దిగారు. జార్ఖండ్ అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం మేరకు కాంగ్రెస్ - జేఎంఎం చెరో సీటు దక్కించుకునే విధంగా ఒప్పందం జరిగింది. కాగా.. చివరి నిమిషంలో పరిమళ్ నత్వానీ బరిలో నిలిచారు. అదే సమయం లో సాయిరెడ్డి సైతం నామినేషన్ తీసుకోవటం పైన జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక.. పరిమళ్ నత్వానీ కోసమే సాయిరెడ్డి రంగంలోకి దిగారనే వార్తలు ప్రచారం జరిగాయి. గెలుపునకు కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరమైన వేళ పరిమళ్ నత్వానీకి ఖచ్చితంగా 28 ఓట్లు లభించాయి. మరోవైపు, అధికార కూటమి తరఫున గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా కేవలం 20 ఓట్లు మాత్రమే సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

 సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!
సాయికృష్ణ ఎపిసోడ్ లో సీఐ నాగరాజు పై హత్యాయత్నం కేసు..!!
vijaya-sai-reddy-congratulates-parimal-nathwani-praises-his-parliamentary-experience

మరోసారి రాజకీయ చర్చల్లో సాయిరెడ్డి

https://twitter.com/VSReddy_MP/status/2067831264862933483

జార్ఖండ్ అసెంబ్లీలోని మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు నూటికి నూరు శాతం ఓటింగ్‌లో పాల్గొనగా.. నత్వానీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నారు. అయితే, జార్ఖండ్‌లో అధికార ఇండియా కూటమి వ్యూహాలను చిత్తు చేస్తూ నత్వానీ గెలుపు వెనుక విజయ సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి విజయసాయిరెడ్డి రాంచీ వేదికగా తెరవెనుక చక్రం తిప్పారని చెబుతున్నారు. నత్వానీ గెలుపునకు బీజేపీ సంఖ్యాబలం కాకుండా అదనంగా అవసరమైన ఆ నలుగురు ఎమ్మెల్యేల ఓట్లను సర్దుబాటు చేయడంలో సాయిరెడ్డే ఆపరేషన్ పూర్తి చేసారని తెలుస్తోంది. జార్ఖండ్ అధికార కూటమి లోని అంతర్గత విభేదాలను ఆసరాగా చేసుకుని, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా క్యాంపు నుండి ఓట్లను క్రాస్ ఓటింగ్ ద్వారా నత్వానీ వైపు మళ్లించడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అవ్వటంతో పరిమళ్ నత్వానీ గెలుపు ఖాయమైందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. దీంతో.. ఇప్పుడు సాయిరెడ్డి రాజకీయ భవితవ్యం పై నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా అనే చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+