బొల్లి మచ్చలతో బాధపడుతున్నారా.. ? శాశ్వత పరిష్కారం ఇదేనా..?
బొల్లి మచ్చలు అనేది చర్మ వ్యాధి. చర్మం కొన్నిచోట్ల సహజ రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీనినే చాలామంది తెల్లపొడ, బొల్లి, విటిలిగో అనే పేర్లతో పిలుస్తారు. కొందరికి అక్కడక్కడా ఉంటాయి. మరికొందరికి శరీరమంతా విస్తరిస్తుంటాయి. ఈ మచ్చల కారణంగా చాలామంది బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అసౌకర్యంగా భావిస్తుంటారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అయితే బొల్లి రావడానికి వివిధ కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
మారుతున్న కాలాన్ని బట్టి వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో బొల్లి వ్యాధికి ఆధునిక వైద్యరంగంలో ఓ అద్భుతమైన చికిత్స అందుబాటులో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్స వల్ల శరీరంపై ఉండే తెల్లటి మచ్చలను కనిపించకుండా చేసుకోవచ్చని అంటున్నారు. బొల్లి మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. ఈ మచ్చలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ కారణంగా.. మరికొంత మందిలో వంశపారంపర్యంగా వస్తాయని వివరిస్తున్నారు. అయితే ఈ మచ్చలు శరీరంపై ఏర్పడితే తగిన చికిత్స తీసుకోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు.

మైక్రో పిగ్మెంటేషన్ చికిత్స ద్వారా బొల్లి మచ్చలను నివారించవచ్చని వైద్యులు వివరిస్తున్నారు. మైక్రో పిగ్మెంటేషన్ అంటే, స్కాల్ప్ (తలకు) లేదా ఇతర చర్మ భాగాలకు చిన్న చిన్న చుక్కలుగా పిగ్మెంట్ ను నిక్షిప్తం చేసే ప్రక్రియ. పర్మనెంట్ లేదా సెమీ- పర్మనెంట్ కాస్మెటిక్ ప్రక్రియగా దీన్ని అభివర్ణిస్తారు. సాధారణంగా దీన్ని కనుబొమ్మలు, కనురెప్పలు, పెదవులు, జుట్టు రాలిన చోట ట్రీట్ మెంట్ చేస్తారు. అలాగే తెల్ల మచ్చలు ఉన్నచోట చికిత్స అందిస్తారు. ఇలా చేయడం వల్ల బొల్లి మచ్చలతో బాధపడేవారిలో కొంత వరకు ఆత్మవిశ్వాసం, నమ్మకం కలుగుతాయని నిపుణులు వివరిస్తున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications