3 దశాబ్దాల తర్వాత అర్థకేంద్ర యోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
నవగ్రహాల్లో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అత్యంత నెమ్మదిగా కదులుతాడు. అలాగే కాలానుగుణంగా నక్షత్రాన్ని కూడా మారుస్తుంటాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శనిదేవుడు సంపదకు, కళలకు కారకుడైన రాక్షసుల గురువు శుక్రుడితో కలిసి అర్థకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీనివల్ల మూడు రాశులవారికి అన్నివిధాలుగా అదృష్టం కలిసివస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 28వ తేదీన జరిగే ఈ పరిణామం మూడు దశాబ్దాల తర్వాత చోటుచేసుకోబోతోంది.
వృషభ రాశి
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించబోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే పదోన్నతి రాబోతోంది. అదృష్టవంతులవుతారు. వ్యాపారవేత్తలు డబ్బును భారీగా ఆర్జిస్తారు. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి వెళ్తారు. కుటుంబ సభ్యులతో గడపడం కోసం అధిక సమయాన్ని వెచ్చిస్తారు. అందరూ కలిసి పుణ్యతీర్థాల సందర్శనకు వెళతారు.

మీన రాశి
ఇప్పటివరకు జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మానవ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంది. వారసత్వంగా తండ్రి వైపు నుంచి, అలాగే భార్య వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. దీర్ఘకాలికంగా మీకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు.
మకర రాశి
ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి మంచి పేరు వస్తుంది. సమాజంలో గౌరవం కలుగుతుంది. హోదా పెరుగుతుంది. అంతేకాకుండా విలాసాలు, సౌకర్యాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక వాతావరణంపట్ల మొగ్గు చూపుతారు. అంకిత భావంతో పనిచేసి విజయాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఒకరకంగా ఈ సమయం వారికి బంగారంలాంటి సమయం అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications