కార్తీకంలో పూజించబడే పవిత్ర వృక్షాలు
ఓ పృధు మహా ! పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి.
పునః నారదుడు ప్రవచిస్తున్నాడు:
ఓ పృధు మహా ! పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల - త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి.
వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకూ బృందా మోహముతో మందుడై వున్న విష్ణువు తన చుట్టూ చెట్లయి మొలచిన లక్ష్మీ, స రస్వతీ, పార్వతీ మహిమల వలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు.

కానీ, వాటిలో లక్ష్మీదత్తబీజాలు ఈర్థ్యాగుణాన్వితాలయి వుండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధే యమై, విష్ణువునకు ఎడమయ్యింది.కేవల అనురాగ పూరితాలయిన ఉసిరి, తులసి - మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి.
తద్వారా విష్ణువు మోహ విముక్తుడై, ధాత్రీ తులసీ సమేతుడయి సర్వదేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్లాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు.












Click it and Unblock the Notifications