మహాశివరాత్రి 2024: ఈ పవిత్ర వస్తువులను సమర్పిస్తే శివయ్య కటాక్షం.. సంపద వర్షం!!
మహాశివరాత్రి పర్వదినం. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ అత్యంత పవిత్రంగా జరుపుకునే విశేషమైన పర్వదినం మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు ఎవరైతే పరమశివుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి, ఉపవాస దీక్షను ఆచరించి, జాగరణ చేస్తారో వారికి సత్ఫలితాలు వస్తాయని, పాపాలు పోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని, సంపద, శ్రేయస్సు కలుగుతుందని, శివయ్య కటాక్షం దొరుకుతుందని చెబుతారు.
శివరాత్రి పర్వదినం నాడు శివునికి ఇష్టమైనటువంటి వస్తువులను సమర్పిస్తే మంచిదని చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో వాటి ప్రాధాన్యత ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఈరోజు శివయ్యకు పాలు సమర్పిస్తే, శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శాంతియుతమైన సామరస్యపూర్వకమైన జీవితం లభిస్తుందని చెబుతారు. పాలు స్వచ్ఛతకు ప్రతీక కాబట్టి, అటువంటి స్వచ్ఛమైన పాలను శివయ్యకు నివేదించాలని చెబుతారు.

శివుడికి బిల్వపత్రాలు అంటే అత్యంత ఇష్టం. శివయ్యను బిల్వపత్రాలతో పూజిస్తే శివుడు సంతృప్తి చెంది భక్తులను కటాక్షిస్తాడు. భక్తవ శంకరుడు, భోళా శంకరుడు అయిన శివుడికి గంగమ్మ అంటే అమితమైన ఇష్టం. అందుకే శివుడికి జలాన్ని నివేదిస్తే, నీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతృప్తి చెందుతాడు. శివయ్యను నీటితో అభిషేకిస్తే మనలోని పాపాలు, మలినాలు ప్రక్షాళన అవుతాయి.
శివుడికి ఉమ్మెత్త పూలు అంటే చాలా ఇష్టం. శివుడికి ఉమ్మెత్త పూలను సమర్పించడం అంటే మన కోరికలను, మన అహంకారాన్ని ఆ భగవంతుని ముందు పెట్టి కాపాడమని శరణు కోరడమే. శివుడికి సింధూరాన్ని సమర్పించడం చాలా మంచిది. సింధూరం సమర్పించడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. ఇది కుటుంబ శ్రేయస్సుకి దోహదం చేస్తుంది.
శివుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం. వెలగపండుని శివుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శివయ్య సంతృప్తి చెంది మనల్ని కరుణిస్తాడు. వెలగపండు ఆధ్యాత్మిక వృద్ధి, జ్ఞానోదయం ప్రసాదిస్తుంది. శివుడికి తేనె నివేదించడం తేనెను శివుడికి నివేదించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు.
అలాగే శివుడి ముందు కొబ్బరికాయను పగలగొట్టడం మన అహంకారాన్ని విచ్చిన్నం చేసి, స్వచ్ఛమైన మనసుతో భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమేనని చెబుతారు. ఇలా ఈ పవిత్రమైన వస్తువులతో శివయ్యను ఆరాధించిన వారికి శివుడి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందని నమ్ముతారు. మహా శివరాత్రి నాడు ఈ వస్తువులతో శివుడిని పూజించి గొప్ప ఫలితం పొందాలని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications