కుంభరాశిలో శని తిరోగమనం.. నవంబరు 4 వరకు వీరికి కష్టాలే
జ్యోతిష్యంలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇతర గ్రహాలన్నిటికంటే ఎక్కువగా శని మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాడు. శని అనుగ్రహం ఉంటే కూటికి కూడా ఇబ్బందిపడేవాడు ధనవంతుడిగా మారిపోతాడు. కుంభరాశిలో శని తిరోగమించాడు. దీనివల్ల కొన్ని రాశులవారు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈనెల 17న తిరోగమించిన శని నవంబరు 4వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ ప్రభావంతో ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు. చివరకు పెద్ద వివాదానికి దారితీసేంతటి పరిస్థితుల్లోకి నెట్టబడతారు. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మీనరాశి:వీరికి కష్టకాలం. నోటిమాట వల్లే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికన్నా మౌనంగా ఉండటం ఉత్తమం. ఇంట్లో జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి:ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి నిరాశే ఎదురవుతుంది. దీనికితోడు అప్పులపాలవుతారు. మీ కంటికి కనిపించనంత దూరంగా డబ్బు చేజారిపోతుంది. కుటంబంలో వివాదాలు తలెత్తుతాయి.
సింహరాశి:సింహరాశివారు కష్టాలపాలవుతారు. శారీరక, మానసిక అనారోగ్యంతో సతమతమవుతుంటారు. ప్రత్యర్థులవల్ల అవమానాలను ఎదుర్కొంటారు. ఏ పనిచేసినా కలిసిరాదు.
వాస్తవానికి జ్యోతిష్య శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులవారికి అనుకూల పరిస్థితులు ఎదురైతే, మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు జులై ఒకటో తేదీన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆగస్టు 17వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు.












Click it and Unblock the Notifications