ఈ నెలాఖరు నుంచి ఈ రాశులవారు నక్క తోక తొక్కినట్లే!
జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటే అదృష్టం రెట్టింపవుతుంది. ఆనందానికి, సంతోషానికి, వివాహానికి, సంపదకు గురుణ్ని కారకుడిగా భావిస్తారు. డిసెంబరు నెలాఖరులో గురువు సంచారం చేయబోతున్నారు. 31వ తేదీ ఉదయం ఏడుగంటలకు బృహస్పతి ప్రత్యక్షంగా సంచారం చేయబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతోపాటు నష్టాలు కూడా కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. గురుడి సంచారం ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి: ఈ రాశివారికి గురుడు పదో స్థానంలో ఉంటున్నాడు. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడంవల్ల ఊహించనిరీతిలో మంచి ఫలితాలు పొందుతారు. సంపదకు, ఆనందానికి లోటుండదు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలోపేతమవుతుంది.

సింహరాశి: ఈ రాశివారికి గురుడి సంచారం తొమ్మిదో స్థానంలో జరగబోతోంది. ఉద్యోగాలు చేసేవారికి ఊహించనిరీతిలో లాభాలున్నాయి. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్తరంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
ధనస్సు రాశి: ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. గురుడు ఈ రాశివారి జాతకంలో ఐదోస్థానంలో సంచారం చేయబోతోంది. వ్యాపారాలు చేసేవారు దీనివల్ల లాభపడతారు. ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యలకు కూడా ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది.












Click it and Unblock the Notifications