అక్షయ తృతీయ నాడు దానాలు చెయ్యలేనివారు ఈ పనులు చెయ్యండి!!
అక్షయ తృతీయ.. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయం ఆడిన రోజు. భక్తులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు. ప్రహ్లాదుడికి నరసింహుడు దర్శనమిచ్చిన రోజు. పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుడిని నియమించిన రోజు. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి శుభసూచకమైన రోజు. అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను భావిస్తారు.
అక్షయం అంటే క్షయం కానిది.. తరిగిపోనిది. అందుకే అటువంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు దక్కే ఏ కొద్ది పుణ్యమైనా అది అనంత ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు.

కానీ అక్షయ తృతీయ రోజు మంచి ఫలితం కావాలి అనుకునేవారు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, అక్షయ తృతీయ రోజు దానం చేయాలనుకునేవారు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు గోదానం, భూదానం, వస్త్ర దానం, సువర్ణ దానం ఏది చేసినా మంచే జరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు.
ఇక అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో పూజించాలని, కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవి పూజ చేయాలని చెప్తున్నారు. అక్షయ తృతీయ పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. శ్రీ మహా విష్ణువును అత్యంత భక్తి శ్రద్దలతో పూజించినా ఫలితం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ రోజు గంగానదిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తారు. ఇక అక్షయ తృతీయ రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడ్డ పనులు చేస్తే చెడు జరుగుతుందని చెప్తారు.
-
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications