ఈ రాశులకు ఈ నెల 30 నుంచి జులై 28 వరకు దరిద్రం పట్టుకుంటోంది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని మంచి యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఇవన్నీ కాలనుగుణంగా జరుగుతాయి. ఈనెల 30వ తేదీన శని, కేతువు, కుజుడు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగం ప్రభావం ఈ ఏడాది జులై 28వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారు ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మేష రాశి
కుజుడు, కేతువు, శని కలవడం అనేది ఈ రాశివారికి అతి పెద్ద ప్రమాదకరం అని చెప్పొచ్చు. ఆర్థికంగా వీరికి అనేక నష్టాలు కలుగుతున్నాయి. జీవిత భాగస్వామితో గొడవ పడటంవల్ల కుటుంబంలో అశాంతి నెలకుంటుంది. ఇతరుల విషయంలో డబ్బుల లావాదేవీలకు సంబంధించి అప్రమత్తంగా లేకపోతే నష్టంతోపాటు గొడవలు కూడా జరుగుతాయి. ఏకమైనప్పటికీ వీరు జాగ్రత్తగా ఉండటమే మంచిది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ మూడు గ్రహాలను పూజించడంవల్ల కొంత శాంతి దొరుకుతుంది.

సింహ రాశి
కుటుంబ పరంగా, వృత్తి పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. జీవితంలో అతి పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే కుజుడు, శని, కేతువుకు సంబంధిచిన శ్లోకాలను పఠించడంవల్ల కష్టాల నుంచి బయటపడొచ్చు. ఆరోగ్య పరంగా ఇబ్బందులున్నాయి. అప్రమత్తంగా ఉండటం అవసరం. లేదంటే చిన్నవి కూడా పెద్దవుతాయి. పరమేశ్వరుణ్ని నమ్ముకోవాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు వాటిని పూజించాలి.
కన్యా రాశి
ఆరోగ్యం బాగోదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్దవిగా కనపడతాయి. న్యాయస్థానాల్లో తీర్పులు మీకు అనుకూలంగా రావు. ఖర్చులు పెరుగుతాయి. ఎంత నియంత్రించుకున్నా తప్పదు. అలాగే కొంతమంది మీకు హానిచేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనివల్ల ఉద్రికత్త చోటుచేసుకొని వివాదాలకు కారణమవుతాయి. అవి పెరిగి పెద్దవవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఎదుటివారితే మాట్లాడకుండా ఉండటమే వీరికి మంచిది. లేదంటే షరా మాములే.. గొడవలవుతాయి.












Click it and Unblock the Notifications