వరలక్ష్మీ వ్రతం పూజా విధానం వ్రత కథ
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
"నమస్తేస్తు
మహామాయే
శ్రీ
పీఠే
సుర
పూజితే
శంఖచక్ర
గదా
హస్తే
మహాలక్ష్మీ
నమోస్తుతే"
తాత్పర్యం:- మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి అమ్మవారు.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం భారతీయ హిందువుల సాంప్రదాయ ఆచారంగా వస్తున్నది. వరలక్ష్మీ దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య. శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మానం శ్రావణం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకు ప్రశస్తి. ఈ పండగ ముత్తైదువలకు ఎంతో విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
ఎందుకు ఈ వ్రతం చేస్తారు :- అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
పురాణ గాధ ఏమిటి :- స్కందపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేసాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట.
వరలక్ష్మీదేవి వ్రతం:- ఎవరైతే భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీ దేవి. శ్రీమహావిష్ణువు సహధర్మచారిణి లక్ష్మీదేవి అష్టావతారాలలో వరలక్ష్మీ దేవి ఒకరు. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి , ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవలన లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.
శ్రీవరలక్ష్మి
అమ్మవారి
పూజకు
కావలసిన
సామగ్రి
:-
పసుపు,
కుంకుమ,
గంధం,
విడిపూలు,
పూల
మాలలు,
తమలపాకులు,
30
వక్కలు,
ఖర్జూరాలు
అగరవత్తులు,
కర్పూరం
చిల్లర
పైసలు,
తెల్లని
వస్ర్తం,
రవికలగుడ్డ
మామిడి
ఆకులు,
ఐదు
రకాల
పండ్లు
అమ్మవారి
ఫోటో,
కలశం
కొబ్బరి
కాయలు
తెల్ల
దారం
లేదా
నోము
దారం,
లేదా
పసుపు
రాసిన
కంకణం,
ఇంటిలో
తయారుచేసిన
నైవేధ్యాలు,
బియ్యం,
పంచామృతాలు.
దీపపు
కుందులు,
ఒత్తులు,
నెయ్యి.
ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ముత్తైదువలందరూ చేసే వ్రతం. 'శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే' శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.
వ్రత విధానం :- వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇళ్లును మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా గదిలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. లక్ష్మి అమ్మవారి ఫోటోతో పాటు ఐశ్వర్య కాళీ అమ్మవారి పటం ఉన్నవారు పూజలో పెట్టుకోవచ్చును, ఐశ్వర్య కాళీ అమ్మ వారు అంటే అష్ట లక్ష్ముల సమ్మేళనమే ఐశ్వర్య కాళీ అని గ్రహించండి, ఈ అమ్మవారు అత్యంత శక్తి వంతమైనది ఈ అమ్మవారి పటము ఉన్నవారు తప్పక పూజలో పెట్టండి. పూజాసామగ్రి, తోరం, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.
తోరం తయారు చేసుకోవడం:- తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
గణపతి పూజ:- అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే ... వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం
సుముఖాయ
నమః,
ఓం
ఏకదంతాయ
నమః,
ఓం
కపిలాయ
నమః,
ఓం
గజకర్ణికాయ
నమః,
ఓంలంబోదరాయ
నమః,
ఓం
వికటాయ
నమః,
ఓం
విఘ్నరాజాయ
నమః,
ఓం
గణాధిపాయ
నమః,
ఓంధూమకేతవే
నమః,
ఓం
వక్రతుండాయ
నమః,
ఓం
గణాధ్యక్షాయ
నమః,
ఓం
ఫాలచంద్రాయ
నమః,
ఓం
గజాననాయ
నమః,
ఓం
శూర్పకర్ణాయ
నమః,
ఓం
హేరంబాయ
నమః,
ఓం
స్కందపూర్వజాయనమః,
ఓం
శ్రీ
మహాగణాధిపతయే
నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు వేయాలి.
ఓం
శ్రీ
మహాగణాధిపతయే
నమః
ధూపం
ఆఘ్రాపయామి,
ఓం
శ్రీ
మహాగణాధిపతయే
నమః
దీపం
దర్శయామి.
స్వామివారి
ముందు
పళ్ళగానీ
బెల్లాన్ని
గానీ
నైవేద్యంగా
పెట్టాలి.
ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య
ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
గాయత్రీ
మంత్రాన్ని
జపిస్తూ
నీటిని
నివేదనచేసి
చుట్టూ
జల్లుతూ
...
సత్యం
త్వర్తేన
పరిషించామి,
అమృతమస్తు,
అమృతో
పస్తరణమసి...
ఓం
ప్రాణాయ
స్వాహా,
ఓం
ఆపానాయ
స్వాహా,
ఓం
వ్యానాయస్వాహా,
ఓం
ఉదానాయ
స్వాహా,
ఓం
సమానాయ
స్వాహా,
ఓం
బ్రహ్మేణ్యే
స్వాహా
గుడ
సహిత
ఫల
నివేదనం
సమర్పయామి,
మధ్యే
మధ్యే
పానీయం
సమర్పయామి
(
అని
చదువుతూ
నీళ్ళనువదలాలి
).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. ( కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి ) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
కలశపూజ:-
కలశస్య
ముఖే
విష్ణు
కంఠే
రుద్రసమాశ్రితాః
మూలేతత్ర
స్థితో
బ్రహ్మ
మధ్యే
మాతృగణః
స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే
సప్తద్వీపా
వసుంధరా
ఋగ్వేదోధ
యజుర్వేదో
స్సామవేదో
అధర్వణః
అంగైశ్చ
స్సహితా
స్సర్వే
కలశాంబు
సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీళ్ళను పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ:- పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై
నమః
-
పాదౌ
పూజయామి,
చపలాయై
నమః
-
జానునీ
పూజయామి,
పీతాంబరాయైనమః
-
ఉరుం
పూజయామి,
కమలవాసిన్యైనమః
-
కటిం
పూజయామి,
పద్మాలయాయైనమః
-నాభిం
పూజయామి,
మదనమాత్రేనమః
-
స్తనౌ
పూజయామి,
కంబుకంఠ్యై
నమః-
కంఠంపూజయామి,
సుముఖాయైనమః
-
ముఖంపూజయామి,
సునేత్రాయైనమః
-
నేత్రౌపూజయామి,
రమాయైనమః
-
కర్ణౌ
పూజయామి,
కమలాయైనమః
-
శిరః
పూజయామి,
శ్రీవరలక్ష్య్మైనమః
-
సర్వాణ్యంగాని
పూజయామి.
(ఆ
తరువాత
పుష్పాలతో
అమ్మవారిని
ఈ
అష్టోత్తర
శతనామాలతో
పూజించాలి)
వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:-
ఓం
ప్రకృత్యై
నమః
ఓం
వికృతై
నమః
ఓం
విద్యాయై
నమః,
ఓం
సర్వభూత
హితప్రదాయై
నమః
ఓం
శ్రద్ధాయై
నమః
ఓం
విభూత్యై
నమః,
ఓం
సురభ్యై
నమః
ఓంపరమాత్మికాయై
నమః
ఓం
వాచ్యై
నమః
ఓం
పద్మాలయాయై
నమః
ఓం
శుచయే
నమః
ఓం
స్వాహాయై
నమః
ఓం
స్వధాయై
నమః
ఓం
సుధాయై
నమః
ఓం
ధన్యాయై
నమః
ఓం
హిరణ్మయై
నమః
ఓం
లక్ష్మ్యై
నమః
ఓం
నిత్యపుష్టాయై
నమః
ఓం
విభావర్యైనమః,
ఓం
ఆదిత్యై
నమః
ఓం
దిత్యై
నమః
ఓం
దీప్తాయై
నమః
ఓం
రమాయై
నమః
ఓం
వసుధాయై
నమః
ఓం
వసుధారిణై
నమః
ఓం
కమలాయై
నమః
ఓం
కాంతాయై
నమః
ఓం
కామాక్ష్యై
నమః
ఓం
క్రోధ
సంభవాయై
నమః
ఓం
అనుగ్రహ
ప్రదాయై
నమః
ఓం
బుద్ధ్యె
నమః
ఓం
అనఘాయై
నమః
ఓం
హరివల్లభాయై
నమః
ఓం
అశోకాయై
నమః
ఓం
అమృతాయై
నమః
ఓం
దీపాయై
నమః
ఓం
తుష్టయే
నమః
ఓం
విష్ణుపత్న్యై
నమః
ఓం
లోకశోకవినాశిన్యై
నమః
ఓం
ధర్మనిలయాయై
నమః
ఓం
కరుణాయై
నమః
ఓం
లోకమాత్రే
నమః
ఓం
పద్మప్రియాయై
నమః
ఓం
పద్మహస్తాయై
నమః
ఓం
పద్మాక్ష్యై
నమః
ఓం
పద్మసుందర్యై
నమః
ఓం
పద్మోద్భవాయై
నమః
ఓం
పద్మముఖియై
నమః
ఓం
పద్మనాభప్రియాయై
నమః
ఓం
రమాయై
నమః
ఓం
పద్మమాలాధరాయై
నమః
ఓం
దేవ్యై
నమః
ఓం
పద్మిన్యై
నమః
ఓం
పద్మ
గంధిన్యైనమః
ఓం
పుణ్యగంధాయై
నమః
ఓం
సుప్రసన్నాయై
నమః
ఓం
ప్రసాదాభిముఖీయైనమః
ఓం
ప్రభాయై
నమః
ఓం
చంద్రవదనాయై
నమః
ఓం
చంద్రాయై
నమః
ఓం
చంద్రసహోదర్యై
నమః
ఓం
చతుర్భుజాయై
నమః
ఓం
చంద్ర
రూపాయై
నమః
ఓం
ఇందిరాయై
నమః
ఓం
ఇందుశీతలాయై
నమః
ఓం
ఆహ్లాదజనన్యై
నమః
ఓం
పుష్ట్యెనమః
ఓం
శివాయై
నమః
ఓం
శివకర్యై
నమః
ఓం
సత్యై
నమః
ఓం
విమలాయై
నమః
ఓం
విశ్వజనన్యై
నమః
ఓం
దారిద్ర
నాశిన్యై
నమః
ఓం
ప్రీతి
పుష్కరిణ్యైనమః
ఓం
శాంత్యై
నమః
ఓం
శుక్లమాలాంబరాయై
నమః
ఓం
శ్రీయై
నమః
ఓం
భాస్కర్యై
నమః
ఓం
బిల్వ
నిలయాయై
నమః,
ఓం
వరారోహాయై
నమః
ఓం
యశస్విన్యైనమః
ఓం
వసుంధరాయై
నమః
ఓం
ఉదారాంగాయై
నమః
ఓం
హరిణ్యై
నమః
ఓం
హేమమాలిన్యై
నమః
ఓం
ధనధాన్యకర్యై
నమః
ఓం
సిద్ధ్యై
నమః
ఓం
త్రైణసౌమ్యాయై
నమః
ఓం
శుభప్రదాయై
నమః
ఓం
నృపవేశగతానందాయై
నమః
ఓం
వరలక్ష్మ్యై
నమః
ఓం
వసుప్రదాయై
నమః
ఓం
శుభాయై
నమః
ఓం
హిరణ్యప్రాకారాయై
నమః
ఓం
సముద్రతనయాయై
నమః
ఓం
జయాయై
నమః
ఓం
మంగళాదేవ్యై
నమః
ఓం
విష్ణువక్షస్థల
స్థితాయై
నమః
ఓం
ప్రసన్నాక్ష్యైనమః
ఓం
నారాయణసీమాశ్రితాయై
నమః
ఓం
దారిద్ర
ధ్వంసిన్యై
నమః
ఓం
సర్వోపద్రవ
వారిణ్యై
నమః
ఓం
నవదుర్గాయై
నమః
ఓం
మహాకాళ్యై
నమః
ఓం
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై
నమః
ఓం
త్రికాలజ్ఞానసంపన్నాయై
నమః
ఓం
భువనేశ్వర్యై
నమః
తోరపూజ :- తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః
ప్రథమగ్రంథిం
పూజయామి,
రమాయైనమః
ద్వితీయ
గ్రంథిం
పూజయామి,
లోకమాత్రేనమః
తృతీయ
గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః
చతుర్థ
గ్రంథిం
పూజయామి,
మహాలక్ష్మ్యై
నమః
పంచమ
గ్రంథిం
పూజయామి,
క్షీరాబ్ది
తనయాయై
నమః
షష్ఠమ
గ్రంథిం
పూజయామి,
విశ్వసాక్షిణ్యై
నమః
సప్తమగ్రంథిం
పూజయామి,
చంద్రసోదర్యైనమః
అష్టమగ్రంథిం
పూజయామి,
శ్రీ
వరలక్ష్మీయై
నమః
నవమగ్రంథిం
పూజయామి.
ఈ
కింది
శ్లోకాలు
చదువుతూ
తోరం
కట్టుకోవాలి
బద్నామి
దక్షిణేహస్తే
నవసూత్రం
శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ
మమ
సౌభాగ్యం
దేహిమే
రమే
వరలక్ష్మీ వ్రత కథ:- పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ప్రాణేశ్వరా! స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.
అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక పుణ్య స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్త,మామలను సేవలు చేస్తూ తరించేంది.
వరలక్ష్మీ అమ్మవారి సాక్షాత్కారం:- వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది' అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు.
వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతురగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.
ఓ మునులారా... శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథను విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.
ఇక్కడ ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమిటనగా భగవంతున్ని పూజించుటకు హంగు, ఆర్భాటాలు అవసరంలేదు. తమ స్తోమతకు తగ్గట్టుగానే చేసుకోవాలి. లేని పోనీ తమ అంతస్తులను ప్రదర్శించే పూజకాదు. అలాంటి ఆలోచనతో పూజ, వ్రతాలు ఎన్ని సంవత్సరాలు చేసినా ఫలితం దక్కదు. మరీ అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అమ్మ వారికి కావలసింది శుచి శుభ్రత, స్వచ్చమైన మనస్సుతో ఎవ్వరి సహాయం తీసుకోకుండా ఇష్టపూర్వకంగా భక్తీ శ్రద్ధలతో అన్ని పనులను తానే చేసుకుని సహనం కోల్పోకుండా ఎవ్వరిని ఇబ్బంది పెట్టక సహనం, శాంతం పాటిస్తూ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తూ ఉండగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు వారికి తప్పక అమ్మవారి అనుగ్రహం పై కధలో చెప్పినట్లు కలుగుతుంది.