వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేదల కోసం ప్రత్యేక పథకాలు
న్యూఢిల్లీ : పేదప్రజలకోసం ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. శనివారం నాడు ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.
స్సి, ఎస్టి, బిసిలతో పాటు మైనార్టీలు, మహిళల అభ్యున్నతికి అవసరమైన పథకాలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు కాంగ్రెస్ రాష్ట్రాలుఆదర్శంగా నిలవాలని ఆమె అన్నారు. నిధుల కోసం అవసరమైతే కేంద్రంపై వత్తిడి తేవాలని ఆమె అన్నారు. అయితే ఈ విషయంలో కేంద్రంతో శతృవైఖరిని మాత్రం పెట్టుకోవద్దని ఆమె సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల సదస్సు జరగడం ఇది రెండో సారి. కేరళ ముఖ్యమంత్రి ఆంటోనీ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
Story first published: Saturday, June 16, 2001, 23:53 [IST]