గెలుపుగుర్రాల కోసం బాబు వేట
హైదరాబాద్ః స్థానిక ఎన్నికల్లో గెలుపుగుర్రాల కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేట ప్రారంభించారు. జూలై లో జరిగే జడ్.పి.టి.సి. ఎంపిటిసి ఎన్నికల్లో, ఆగస్టులో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియకు చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ కార్యాలయంలోశ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, ఎమ్మెల్ల్యేలు, ఎం.పి.లు పొలిట్ బ్యూరో సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఈ నెల 25 వరకు చంద్రబాబు నాయుడు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్ల్యేలు ఇతరసీనియర్ నాయకులతో స్థానిక ఎన్నికల్లో గెలిచే సత్తా వున్న అభ్యర్థుల గురించి చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
స్థానిక ఎన్నికల్లో గత నాలుగేళ్ళలో తెలుగుదేశం పార్టీ సాధించిన అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా విజయం సాధించాలని తెలుగుదేశం వ్యూహం రూపొందిస్తున్నది.