క్రికెట్ ప్రపంచకప్ ప్రైజ్ మనీ పెంపు
జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికాలోజరిగే 2003 క్రికెట్ ప్రపంచ కప్ ప్రైజ్ మనీనిఐదు మిలియన్ డాలర్లకు పెంచుతున్నారు. ఇతరవరల్డ్ క్లాస్ క్రీడల వల్ల లభించిన ఆర్థికప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని క్రికెట్వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ఐదింతలు పెంచాలనినిర్ణయించుకున్నట్లు ప్రపంచ కప్ అధికారవర్గాలు చెప్పాయి.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రైజ్ మనీ పెంపును అంగీకరించిందని, ఈమొత్తాన్ని ఎలా విభజించాలనేది పోటీల్లోపాల్గొనే క్రికెట్ జట్ల కెప్టెన్లు సూచిస్తారని 2003 ప్రపంచకప్ కమ్యూనికేషన్స్ మేనేజర్ రోడ్నీ హార్ట్మన్ చెప్పినట్లుదక్షిణాఫ్రికా దిన పత్రిక స్టార్ రాసింది.
ప్రేక్షకులు మైదానంలోకిదూసుకుని రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుహార్ట్మన్ చెప్పారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామనిఆయన చెప్పారు. ప్రతి మ్యాచ్లో టాస్ కోసం ఉపయోగించడానికి 54వన్-ఔన్స్ బంగారు నాణేలను తయారు చేస్తున్నట్లుఆయన తెలిపారు.
నాణేనికి ఒక వైపు 2003 ప్రపంచకప్ లోగోతో అధ్యక్షుడు థాబో మెబెకి ముఖం ఒకవైపు, మ్యాచ్లో పాల్గొనే రెండు జట్ల పేర్లు, తేదీ,మ్యాచ్ జరిగే స్థలం పేరు మరో వైపు ముద్రించేందుకుదక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని కోరినట్లు హార్ట్మన్ తెలిపారు.