RBI: మే 26న కీలక పరిణామం.. అసలేంటి ఈ 'డాలర్-రూపాయి స్వాప్'?

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల మంట, ఇరాన్ యుద్ధ మేఘాల వంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ రికార్డు స్థాయికి పడిపోతోంది. ఈ పతనానికి అడ్డుకట్ట వేసి, భారత బ్యాంకింగ్ వ్యవస్థలోకి సరికొత్త ఊపిరి లూదేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రంగంలోకి దిగింది. మార్కెట్లో లిక్విడిటీని (నగదు లభ్యత) పెంచడంతో పాటు రూపాయిని నిలబెట్టేందుకు ఏకంగా 5 బిలియన్ డాలర్ల విలువైన 'డాలరు-రూపాయి బై/సెల్‌ స్వాప్‌' వేలాన్ని నిర్వహించబోతున్నట్లు ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మే 26న ఈ ప్రతిష్టాత్మక వేలం ప్రక్రియ జరగనుంది.

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులను నిశితంగా సమీక్షించిన తర్వాతే, మూడేళ్ల కాలపరిమితితో కూడిన ఈ యూఎస్‌డీ/ఐఎన్‌ఆర్‌ (USD/INR) స్వాప్ వేలాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తన తాజా సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి మరింత బలహీనపడకుండా చూసేందుకు ఈ చర్యలు అత్యంత కీలకంగా మారనున్నాయి.

RBI to Auction 5 Billion Dollar USD-INR Swap to Rescue Rupee from Falling Amid Global Uncertainties
2007 తర్వాత ఇదే మొదటిసారి.. అగాధంలోకి రూపాయి
2007 తర్వాత ఇదే మొదటిసారి.. అగాధంలోకి రూపాయి

అసలు ఏమిటీ 'స్వాప్' వేలం?

ఆర్థిక మార్కెట్లలో నగదు కొరతను తీర్చడానికి, కరెన్సీ విలువను స్థిరీకరించడానికి ఆర్‌బీఐ ఉపయోగించే ఒక వ్యూహాత్మక ఆయుధమే ఈ 'బై/సెల్‌ స్వాప్‌'. ఈ ప్రక్రియ సాధారణంగా ఇలా సాగుతుంది:

  • డాలర్ల విక్రయం: వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న అమెరికన్ డాలర్లను రిజర్వ్ బ్యాంక్‌కు విక్రయించి, దానికి సమానమైన భారతీయ రూపాయలను పొందుతాయి. దీనివల్ల బ్యాంకుల వద్ద తక్షణమే రూపాయిల లభ్యత పెరుగుతుంది.
  • తిరిగి కొనుగోలు ఒప్పందం: సరిగ్గా మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత, అదే మొత్తంలో డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం ధరతో ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తిరిగి కొనుగోలు చేస్తాయి.
ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా రూపాయి! చరిత్ర చూడని పతనం
ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా రూపాయి! చరిత్ర చూడని పతనం

లాభం ఏంటి?

ఈ వేలం ద్వారా మార్కెట్లోకి భారీగా రూపాయలు అందుబాటులోకి రావడమే కాకుండా, దేశ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) బలోపేతం అవుతాయి. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఈ మెగా వేలంలో పాల్గొనాలనుకునే బ్యాంకులు కనీసం 10 మిలియన్ డాలర్ల సైజ్‌తో బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ నిబంధన విధించింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లలో సానుకూలతను నింపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+