పంచాయతీ రిట్లకొట్టివేత
హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికలనునిలిపేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను రాష్ట్రహైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సత్యబ్రతసిన్హా, జస్టిస్ సుభాషన్ రెడ్డి, వి.వి.యస్.రావులతో కూడిన హైకోర్టు విస్తృత ధర్మాసనంబుధవారం ఆ రిట్ పిటిషన్లనుకొట్టివేసింది. ప్రజా ప్రయోజనాల కింద ఐదు రిట్ పిటిషన్లుకోర్టులో దాఖలయ్యాయి.
పంచాయతీలకు అధికారాల బదలాయింపు, లంబాడా తండాలను పంచాయతీలుగా గుర్తించాలనే డిమాండ్, పంచాయతీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లకు ఎస్సిల వర్గీకరణను ప్రాతిపదికగా తీసుకోవాలనేవిజ్ఞప్తికి సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, సర్పంచ్లసంఘం, ఎస్సి, బిసి సంక్షేమ సంఘం దాఖలు చేసిన వేరువేరు పిటీషన్లను హైకోర్టు విస్తృత ధర్మాసనం కొట్టివేయడంతో గ్రామపంచాయతి ఎన్నికల నిర్వహణకు అవరోధాలు తొలిగిపోయినట్టేనని పరిశీలకులుఅంటున్నారు.
అయితే కోర్టు తీర్పువల్ల పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమంఅయినప్పటికీ ప్రస్తుత ప్రాదేశీక ఎన్నికల తర్వాతనే పంచాయతి ఎన్నికలవిషయం యోచిస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్పాయి. వచ్చే నెలలో జరుగనున్న ప్రాదేశిక ఎన్నికల తర్వాత పంచాయతి ఎన్నికలవిషయంలో చర్య తీసుకుంటామని ఎన్నికల కమిషన్ తెలిపింది.
హైకోర్టు
తీర్పుపై
సుప్రీంకోర్టుకువెళ్లాలా,
వద్దా
అనే
ఆలోచనలో
పిటిషనుదార్లువున్నారు.