వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పీపుల్స్వార్తో టిఆర్ఎస్ కుమ్మక్కు
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర సమితి పీపుల్స్వార్ నక్సలైట్లతో కుమ్మక్కైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. టిఆర్ఎస్లో చురుగ్గా పాల్గొంటున్నవారు, ఆ పార్టీ కార్యక్రమాలను బట్టి పీపుల్స్వార్ నక్సల్స్తో టిఆర్ఎస్ మిలాఖత్ అయిన విషయం స్పష్టంగా బయటపడిందని తెలుగుదేశం నాయకుడు ఎర్రన్నాయుడు పేర్కొన్నారు.
బుధవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ, శాంతిపాఠాలు వల్లించే టిఆర్ఎస్నేతలు హింసావాదులైన నక్సలైట్లతో చేతులు కలపడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని నాయుడు విమర్శించారు.
Comments
Story first published: Wednesday, June 27, 2001, 23:53 [IST]