వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్‌ సెంచరీ-భారత్‌ జయభేరి

By Staff
|
Google Oneindia TeluguNews

హరారేః వెస్టిండీస్‌ తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ లో కూడా భారత్‌ జయభేరి మోగించింది. బ్యాటింగ్‌ సంచలనం సచిన్‌ వన్డే కెరీర్‌ లో 29వసెంచరీ నమోదు చేసుకున్నాడు. గంగూలీ కూడా చెప్పుకోతగ్గ విధంగా పరుగులు చేయడంతో భారత్‌ సునాయాసంగా వెస్టిండీస్‌ పైవిజయం సాధించింది. ట్రయాంగ్యులర్‌ సిరీస్‌ లో నాలుగు మ్యాచ్‌ లు గెలిచిన భారత్‌ 7న జరిగేఫైనల్‌ లో వెస్టిండిస్‌ తోనే తలపడుతుంది.

తొలుత టాస్‌ గెలిచి గంగూలీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. భారత్‌ బౌలర్లు బాగా బౌలింగ్‌ చేయడంతో వెస్టిండీస్‌ ఐదువికెట్లు కోల్పోయి 50 ఓవర్లలో 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ ఓపెనర్లు గట్టి పునాది వేశారు. గంగూలీ 64 పరుగులు, సచిన్‌ 122 పరుగులు చేసి భారత్‌ కు సునాయాసవిజయం అందించారు. సచిన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X