విమాన ప్రమాదంలో 143 మంది మృతి
మాస్కో: రష్యా విమానయాన సంస్థకు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి ప్రమాదానికి గురైన సంఘటనలో 143 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
వ్లాదివోస్తావికవియా ఎయిర్లైన్స్కు చెందిన తుపలెన్-154 విమానం సైబీరియాలో కూలినట్టుగా తెలిసింది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపట్లోనే విమానం రాడార్ స్క్రీన్పైనుంచి అదృశ్యం కావడంతో విమానం ప్రమాదానికి గురైనట్టుగా అధికారులు శంకించారు. విమానం కోసం జరిపిన గాలింపులో కూలిపోయినట్టుగా వెల్లడయిందని అధికారులు తెలిపారు. మాస్కోకు 4 వేల కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు వున్నట్టుగా అధికారులువెల్లడించారు.












Click it and Unblock the Notifications