ఉద్రిక్తతో అట్టుడుకుతున్నచెన్నయ్
చెన్నయ్ఃడిఎంకె ర్యాలీ లో చెలరేగిన హింసాకాండ దరిమిలా చెన్నయ్ నగరమంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ రంగరాజన్ సోమవారం ఉదయం హుటాహుటిన చెన్నయ్ చేరుకున్నారు. ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. డిఎంకె అధినేతఎం. కరుణానిధి కూడా గవర్నర్ ను కలుసుకుంటారని భావిస్తున్నారు.
ర్యాలీ హింసాకాండ అనంతరం కూడా చెన్నయ్ లో ఉద్రిక్తత కొనసాగుతుండడంతో పోలీసులుపెద్దఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం కాల్పుల్లో మరణించిన ఐదుగురి భౌతిక కాయాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండలో పలువురు జర్నలిస్టులతో సహా 50 మంది గాయపడ్డారు.వీరందరినీ డిఎంకె అధినేత కరుణానిధి ఆస్పత్రిలో పరామర్శించారు.
- డిఎంకె ర్యాలీలో చెలరేగిన హింస
- చెన్నయ్హింసపై అట్టుడికిన పార్లమెంటు
- డి.ఎం.కె ఎమ్మెల్ల్యే పెరుమాళ్ మృతి
- న్యాయవిచారణకు జయ ఆదేశం












Click it and Unblock the Notifications