ఆరునెలలు దాటితే అంతే సంగతులు..
న్యూఢిల్లీః ఎమ్మెల్యే కాని వ్యక్తులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భాల్లో ఆరునెలల్లో చట్టసభకు ఎన్నిక కావాలని లేనిపక్షంలో వారు అధికారంలో కొనసాగే అర్హత కొల్పోతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆరునెలల్లో ఎన్నిక కాని వ్యక్తి పదవికి రాజీనామా చేసి తాజాగా మరో ఆరునెలల కాలంకోసం అధికారం చేపట్టడానికివీలులేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ నాయకత్వంలో ధర్మాసనం శుక్రవారం నాడు ప్రకటించింది.
పంజాబ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమారుడు తేజ్పాల్ సింగ్ కేసులో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తమిళనాడు రాజకీయాలపైపెను ప్రభావం చూపే అవకాశం వున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితి మరో మూడు నెలల్లో చట్టసభకు ఎన్నికకావల్సివుంది. ఆమె ఈ సారి ఎన్నిక కాకుంటే రాజీనామా చేసి మరో ఆరునెలలకోసం బాధ్యతస్వీకరిస్తారంటూ వచ్చిన ఊహాగానాలు కోర్టు తీర్పుతో దెబ్బతిన్నాయి.