వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపిఎస్‌లపై ముదురుతున్న వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నైః తమ రాష్ట్ర సర్వీసులో వున్న ముగ్గురు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులను కేంద్ర సర్వీసులకు తిప్పి పంపాల్సిందిగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. చెన్నై నగర పోలీసు కమిషనర్‌ ముత్తుకరుప్పన్‌తో సహా ముగ్గురు ఐపిఎస్‌ అధికారులను కేంద్రం తమకు అప్పగించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరిన విషయం విదితమే.

ఈ విషయంలో కేంద్రప్రభుత్వం లేఖకు తగిన విధమైన సమాధానం తాము పంపనున్నట్టుగా ఆమె చెప్పారు. రాష్ట్రంలో సమర్ధులైన ఐపిఎస్‌ అధికారుల కొరత వున్న కారణంగా తాము కేంద్రం అదేశాలను మన్నించలేకపోతున్నట్టుగా ఆమె చెప్పారు.

ఈఅంశం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినవివాదంగా మారే అవకాశం వున్నదన్న అభిప్రాయంపై ఆమె మాటదాటవేశారు. ముత్తుకరప్పన్‌తో సహా జాయింట్‌ కమిషనర్‌ ఎస్‌ జార్జ్‌, డిప్యూటి కమిషనర్‌ క్రిస్టోఫర్‌ నెల్సన్‌లను కేంద్రం అడుగుతున్నది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు ఆమె డిజిపి రాజగోపాలన్‌ను రిలీవ్‌ చేశారు. ఆయన ఎన్‌ఎస్‌జి అధిపతిగా ఢిల్లీలో పదవీ బాధ్యతలుస్వీకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X