ఆఖరు అంకంలో దేశం ఆత్మవిమర్శ
హైదరాబాద్ః ఈ మధ్య కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించింది.
ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా జిల్లాల వారిగా జరుపుతున్న ఆత్మపరిశీలన సమావేశాలు ముగింపునకు వచ్చాయి. ఈ సమావేశాల పరంపరలో ఆఖరుదైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దెబ్బతినడానికి కారణాలను ఆయా జిల్లాల నాయకులువివరించారు.
ఈ
జిల్లాల్లో
పార్టీ
బలహీనతలపై
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు
ఆరా
తీశారు.
ఈ
సమావేశాలు
ముగిసినందున
ఇప్పుడు
అత్యున్నత
స్థాయి
సమీక్ష
కమిటీ
సమగ్ర
నివేదికను
తయారు
చేసి
ముఖ్యమంత్రికిఅందజేస్తుంది.
ఈ
నివేదిక
ఆధారంగా
పార్టీని
బలోపేతం
చేసేందుకు
సమగ్ర
ప్రణాళికను
రచించనున్నట్టుగా
తెలుగుదేశం
అధికార
ప్రతినిధి
రావుల
చంద్రశేఖర్రెడ్డి
చెప్పారు.
త్వరలోనే
నియోజకవర్గం
స్థాయి
సమావేశాల
నిర్వహణకు
కూడా
తెలుగుదేశం
పార్టీ
సమాయత్తం
అవుతున్నది.