వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఖరు అంకంలో దేశం ఆత్మవిమర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఈ మధ్య కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించింది.

ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా జిల్లాల వారిగా జరుపుతున్న ఆత్మపరిశీలన సమావేశాలు ముగింపునకు వచ్చాయి. ఈ సమావేశాల పరంపరలో ఆఖరుదైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దెబ్బతినడానికి కారణాలను ఆయా జిల్లాల నాయకులువివరించారు.

ఈ జిల్లాల్లో పార్టీ బలహీనతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ సమావేశాలు ముగిసినందున ఇప్పుడు అత్యున్నత స్థాయి సమీక్ష కమిటీ సమగ్ర నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికిఅందజేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా పార్టీని బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికను రచించనున్నట్టుగా తెలుగుదేశం అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.
త్వరలోనే నియోజకవర్గం స్థాయి సమావేశాల నిర్వహణకు కూడా తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X