వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో అంత్రాక్స్‌ మరణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో ఆరువారాల క్రితం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్‌ఐసిడి)కి చెందిన యు.వి.యస్‌. రాణా చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా అలగుర్ఖి గ్రామంలోఅంత్రాక్స్‌కు ఇద్దరు వ్యక్తులతో పాటు 20 గొర్రెలు, ఒక ఎద్దు, రెండు ఆవులు మరణించినట్లు ఆయన తెలిపారు.
జీవరసాయనాల యుద్ధ ప్రమాదాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన నివేదిక సమర్పించారు.అంత్రాక్స్‌కు గురై మరణించిన పశువుల మాంసం తినడం వల్ల వ్యక్తులకు ఆ వ్యాధి సోకిందని ఆయన చెప్పారు. యేటా భారతదేశంలో ఈ వ్యాధి వస్తుందని,అంత్రాక్స్‌ సోకిన పశువుల మాంసం తినడం వల్ల వ్యక్తులకు ఈ వ్యాధి వస్తోందని ఆయన చెప్పారు.

ఇటీవల ఎన్‌ఐసిడి ఎనిమిది కేసులు నమోదు చేసిందని, మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో గల ఒక తండాలో 1999 జులైలో ఐదు మరణాలు సంభవించాయని, మిడ్నాపూర్‌ జిల్లాలోని బంధుగుట్టు గ్రామంలో 2000 మేలోఅంత్రాక్స్‌ వల్ల రెండు వేల పశువులు, మేకలు, పందులు చనిపోయాయని,వీటి మాంసం తిన్న 43 మందికి అంత్రాక్స్‌ సోకిందని, ఇందులో ముగ్గురు మరణించారని ఆయనవివరించారు.

ప్రస్తుతం అంత్రాక్స్‌ భారతదేశంలో పశు సంపదకు మాత్రమే సోకుతోందని, వ్యాధి నిరోధక టీకాలు సరిగా ఇప్పించకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తోందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X