వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆఫ్ఘన్ ఇళ్ళపై బాంబులు-10మంది మృతి
కాబూల్ః ఆగ్నేయ కాబూల్ లో అమెరికా యుద్ధవిమానాలు ఆదివారం నాడు బాంబుల వర్షం కురిపించాయి. ఈ బాంబుల్లో కొన్ని జనావాసాలపై పడడంతో కనీసం పది మంది దుర్మరణం పాలయ్యారు.
ఆగ్నేయ కాబూల్ లోని ఓ రెండతస్తుల భవనంపై ఆదివారం నాడు బాంబులు పడ్డాయి. దీనితో భవనంలో నివసిస్తున్నఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు. నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పురుషులు మరణించారు. ఈ భవనానికి పక్కనే వున్న మరో ఇల్లు కూడా దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఇళ్ళకు ఆఫ్ఘన్సైనిక స్థావరం కనీసం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో వున్నది. ఎ.ఎఫ్.పి. రిపోర్టర్ ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
అమెరికా దాడులు సృష్టిస్తున్న మారణ కాండకు ఈ దాడే నిదర్శనం అని స్థానికులు వాపోయారు. మహిళలు, చిన్నారులు ఏ చేశారని ఇలా చంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Story first published: Sunday, October 21, 2001, 23:53 [IST]