వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీవ్రవాదానికి పాతరః చంద్రబాబు
హైదరాబాద్ః తీవ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహాపెకలించేందుకు పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి దేవేందర్ గౌడ్, డి.జి.పి. దొర తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో హింసకు, తీవ్రవాదానికి తావు లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది వివిధ తీవ్రవాద, నక్సలైట్ల దాడుల్లో మరణించిన 134 మంది పోలీసులకు ముఖ్యమంత్రి నివాళులుఅర్పించారు.
మారుతున్న
పరిస్థితులకు
అనుగుణంగా
పోలీస్
శాఖను
ఆధునీకరించాల్సిన
అవసరాన్ని
చంద్రబాబు
నొక్కి
చెప్పారు.
ఈ
సందర్భంగా
హోం
మంత్రి
దేవేందర్
గౌడ్
మాట్లాడుతూ
తీవ్రవాదం
సృష్టించే
హింసాకాండను
ఎదుర్కొనేందుకు
పోలీసులు
ఎల్లవేళలా
సన్నద్ధంగా
వుండాలనికోరారు.
Comments
Story first published: Sunday, October 21, 2001, 23:53 [IST]