ఉగ్రరూపం ధరించిన ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్ః ఆర్టీసీ సమ్మె ఆదివారం నాడు ఏడో రోజుకు చేరుకున్నది. తమ డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 16 నుంచి సమ్మె చేస్తున్నవిషయం విదితమే. ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న ఏర్పాట్లుఅరకొరగా మాత్రమే వుండడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెకు మరింత మద్దతు కూడగట్టేందుకు ఆర్టీసీ కార్మిక నేతలు, వామపక్ష నేతలు రాష్ట్ర పర్యటన ప్రారంభించారు.
ఆదివారం నాడు కర్నూలు, తిరుపతి, కాకినాడ, కోదాడ, హైదరాబాద్ తో పాటు పలు ప్రదేశాలలో సమ్మెకు మద్దతుగా ఆర్టీకీ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ, తిరుపతిలో భార్యా బిడ్డలతో ఆర్టీసీ కార్మికులు మానవహాం నిర్మించారు. కాకినాడలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సి.ఐ.టి.యు. ర్యాలీ నిర్వహించింది. మొత్తంమీద సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం ధరిస్తున్నది.