వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః చిత్తూరు జిల్లాపీలేరులో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మరణించారు. యలమంద అటవీ ప్రాంతంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరీ దేవికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు చెందినపీలేరు ప్లాంట్ పై నక్సలైట్లు దాడి జరిపి పెను విధ్వంసానికి పాల్పడినవిషయం విదితమే. ఈ సంఘటన నేపధ్యంలోపీలేరు సమీపంలో కూంబింగ్ చర్యలు చేపడుతున్న పోలీసులకు నక్సలైట్లు తారస పడ్డారు.
లొంగిపొమ్మంటూ చేసిన పోలీసుల హెచ్చరికల్ని పెడచెవినపెట్టి నక్సలైట్లు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా నలుగురు నక్సలైట్లు మరణించినట్లు పోలీసులువివరించారు. నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నక్సలైట్ల దాడుల దృష్ట్యా ప్రధానంగా తెలంగాణా జిల్లాల్లో పోలీసులు విజృంభించారు. కూంబింగ్ లు, సోదాలతో తెలంగాణా పల్లెలు పోలీసుల బూట్ల చప్పుళ్ళతో హోరెత్తి పోతున్నాయి.
Comments
Story first published: Monday, December 3, 2001, 23:53 [IST]