వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొహాలీః బెంగాలీ బాబు,వికెట్ కీపర్ దీప్ దాస్ గుప్తా మచ్చటైన సెంచరీతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడువికెట్లు కోల్పోయి 262 పరుగలు చేసింది. 24 పరుగులకు దాస్వికెట్ కోల్పోయిన భారత్ రెండో రోజున నిలదొక్కుకొని ఆడింది. నైట్ వాచ్ మెన్ గా వచ్చిన అనిల్ కుంబ్లే 36 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తరువాత ఓపెనర్ దీప్ దాస్ కు వైస్ కెప్టెన్ ద్రావిడ్ చక్కని మద్దతు నిచ్చాడు. దీప్ దాస్ గుప్తా 15 ఫోర్లతో 100 పరుగులు చేసి అవుటయ్యాడు. సౌతాఫ్రికా టూర్ లో క్రికెట్ జీవితాన్ని ప్రారంభించిన దీప్ దాస్ అక్కడపెద్దగా రాణించలేదు. సొంతగడ్డపై సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
దీప్ దాస్ అవుటయిన తరువాత బరిలోకి దిగిన సచిన్ సహజశైలిలో ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పూయించాడు. దీప్ దాస్ కు చక్కని మద్దతు ఇచ్చిన ద్రావిడ్ అడపా దడపా ముచ్చటైన షాట్లు కొడుతూసెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ద్రావిడ్ 11 ఫోర్లతో 78 పరుగులు సాధించగా సచిన్ 5 ఫోర్లతో 31 పరుగులు సాధించి క్రీజ్ లో వున్నాడు. ఇంగ్లాండ్ లో అనుభవజ్ఞులైన బౌలర్లు లేకపోవడం, భారత్ ఆటగాళ్ళు సొంతగడ్డపై ఆడుతుండడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Story first published: Tuesday, December 4, 2001, 23:53 [IST]