వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదమే సార్క్‌ ప్రధానాంశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః నేపాల్‌ రాజధాని ఖాట్మండులో జరుగుతున్న సార్క్‌ శిఖరాగ్ర సభల్లో ఉగ్రవాదమే ప్రధానాంశంగా చర్చకు వచ్చే అవకాశం వున్నది. సార్క్‌లో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా వున్న భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో జరుగుతున్న ఈ శిఖరాగ్ర సభ ఇప్పుడు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. భారత ప్రధాని వాజ్‌పేయి గురువారం నాడు లక్నో నుంచి నేరుగా ఖాట్మండు బయలుదేరి వెళ్లుతున్నారు.

కాగా ముషారఫ్‌ ఇప్పటికే చైనా మీదుగా ఖాట్మండు బయలుదేరినట్టుగా సమాచారం అందింది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి చైనా నేతలతో కూడా ముషారఫ్‌ చర్చించినట్టుగా తెలిసింది. శిఖరాగ్ర సభకు ముందుగా జరుగుతున్న సార్క్‌ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్‌, పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ పరస్పరం మర్యాద పూర్వకంగా కరచాలనం చేసుకోవడం మినహా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. దీనిని బట్టే ఉభయదేశాలు ఎంతపట్టుదలగా వున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లక్నోలో జరిగిన సభలో కూడా ప్రధాని పాకిస్తాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌పై దాడితో సహా భారత్‌లో జరిగిన వివిధ నేరాలతో సంబంధం వున్న 20 మంది జాబితాను తాము అందజేస్తే నేరగాళ్లను అప్పగించకుండా పాకిస్తాన్‌ సాక్ష్యాలు కావాలనడం పట్ల ఆయన మండిపడ్డారు. మరోవైపు భారత్‌ కోరుతున్న 20 మందిని అప్పగించే సమస్యే లేదని సాక్ష్యాలు అప్పగిస్తే తమ దేశంలోనే వారిని ప్రాసిక్యూట్‌ చేస్తామని పాక్‌ నేత ముషారఫ్‌ విస్పష్టంగా ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X