వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్‌ మెడలో బాబు వరాలమాల

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌ః 16వ విడత జన్మభూమి ఏడో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదక్‌ జిల్లా దుబ్బాకలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించే వరకు జన్మభూమి ఆగదని ఆయన ప్రకటించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను అధికారును ముందుంచుకొని నేరుగా ప్రజలతో చర్చించడం ఆసక్తి కలిగించింది. ప్రజలు ముఖ్యంగా యువకులు చంద్రబాబు నాయుడుకు సమస్యలను ఏకరవు పెట్టారు. తెలంగాణా వాదం బలంగా వున్న దుబ్బాక ప్రాంతంలో ప్రజలను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారు.

పలు ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రి అక్కడికక్కడే అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులతో చంద్రబాబు రసవత్తర చర్చ జరిపారు. ఆర్థిక కారణాల వల్ల బడిమానుకున్న విద్యార్థులను ఆయన పక్కన కూర్చో పెట్టుకొని బడికి వెళ్ళాల్సిందిగా హితవు చెప్పారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండని కారణంగా తన తల్లితో కూలీకి వెళుతున్నానని చెప్పిన ఓ బాలిక దీనగాధను చంద్రబాబు శ్రద్ధగా ఆలకించారు.

తన వద్ద కూర్చున విద్యార్థులందరి పేర్లు నోట్‌ చేసుకొని వారిని బ్రిడ్జి స్కూలు లేదా గురుకుల పాఠశాలల్లో చేర్పించాలని, అవసరమైతే వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందిచాల్సిందిగా చంద్రబాబు కలెక్టర్‌ ను ఆదేశించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన చంద్రబాబు గ్రామసభ ఆద్యంతం రసవత్తరంగా సాగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X