వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ లో పట్టపగలు హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ లో ఉస్మానియా ఆస్పత్రికి కూతవేటు దూరంలో మంగళవారం పట్టపగలు దారుణ హత్య జరిగింది. పాన్‌ మసాలా వ్యాపారి పురుషోత్తం ను మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని దుండగులు ముస్లింగంజ్‌ బ్రిడ్జిపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. పురుషోత్తం బిజెపి సానుభూతిపరుడు. సంఘటన జరిగిన వెంటనే అక్కడకు పెదఎత్తున పోలీసు దళాలను తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్‌ లో భయాందోళనలు కలిగించేందుకే ఈ హత్యకు పాల్పడ్డారని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపించాయి. బిజెపికి చెందిన కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు మేయర్‌ పదవికి పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా మార్చురీకి వచ్చి ఈ దారుణాన్ని ఖండించారు. ఎన్నికలకు రెండు వారాల ముందు జరిగిన ఈ హత్య మొత్తం మీద రాజకీయ రంగు పులుముకుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X