వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనార్టీల ఓట్లకు చంద్రబాబు గాలం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో మైనార్టీల జీవితాలను సంపూర్ణంగా మార్చివేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం నాడు పలువురు బిజెపి, తెలుగుదేశం నేతలతో కలసి ఆయన జంటనగరాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మతరాజకీయాలతో ప్రజలను వంచించే పార్టీలను దూరంగా తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మైనార్టీల అభ్యున్నతికి తమ పార్టీ కోట్లాది రూపాయలతో పథకాన్ని సిద్ధం చేసిందని ఆయన చెప్పారు. కుల, మతాల ప్రమేయం లేకుండా అందరు మహిళలు మగవారితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. జంటనగరాల్లో మైనార్టీల వెనకబాటు తనానికి మజ్లిస్‌ రాజకీయాలే కారణమని చంద్రబాబు ఆరోపించారు. మతతత్వ పార్టీలు, ప్రాంతీయ తత్వ పార్టీలకు బల్దియా ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జంటనగరాల అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు నగరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఏనాడూ చేయలేదని ఆయన విమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X