వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌: చేజేతులా ఓడిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కటక్‌: ఇంగ్లాండుతో మంగళవారం జరిగిన రెండో టెస్టును భారత్‌ చేజేతులా జారవిడుచుకున్నది. ఇంగ్లాండు భారత జట్టుపై 16 పరుగులతో తేడాతో గెలిచింది. భారత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ఘోరంగా విఫలం కావడం ఇంగ్లాండుకు కలిసి వచ్చింది. బౌలింగ్‌లో,ఫీల్డింగులో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇంగ్లాండు పోరాడి గెలిచింది. ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్‌లో కాలింగ్‌వుడ్‌ 71 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసి జట్టువిజయానికి పునాదులు వేసిన కాలింగ్‌ వుడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. వాగన్‌ 63 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రన్నవుట్‌ అయ్యాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండు ఏడువికెట్లు కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 250 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ మంచి ప్రారంభాన్నిఅందిస్తోందనుకున్న సమయంలో కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీవికెట్‌ను కోల్పోయింది. గంగూలీ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్దపెవిలియన్‌ దారి పట్టాడు. ఆ తర్వాత సచిన్‌తో కలిసి దినేష్‌ మోంగియా నిలకడతో ఆడుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు సచిన్‌ రన్‌ అవుట్‌ అయ్యాడు. టెండూల్కర్‌ 45 పరుగుల చేశాడు. దినేష్‌ మోంగ్యా 49 పరుగులకు అవుట్‌కాగా, వివియస్‌ లక్ష్మణ్‌ అనవసరమైన పరుగుకు పోయి మూడు పరుగులకే రన్నవుట్‌ అయ్యాడు. అయితే, కుంబ్లే, అజిత్‌అగార్కర్‌ ధాటిగా ఆడుతూ భారత్‌ను విజయపథాన నడిపిస్తారనే ఆశలు చిగురించాయి. అయితే, కుంబ్లే భారీ షాట్‌కు పోయి క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాతఅగార్కర్‌ 29 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అవుట్‌ కావడంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లాండు బౌలర్లలో గఫ్‌ మూడువికెట్లు తీశాడు.

కోల్‌కత్తా వన్డేలో భారత్‌ ఇంగ్లాండుపై విజయం సాధించింది. కటక్‌లో జరిగిన రెండో వన్డేను గెల్చుకుని ఇంగ్లాండు సిరీస్‌ను సమం చేసింది. మూడు వన్డే ఈ నెల 25వ తేదీన చెన్నైలో జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X