నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద కాంగ్రెస్ జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ (జడ్పిటిసి) సభ్యుడు హత్యకు గురయ్యారు.
కాంగ్రెస్ జడ్పిటిసి సభ్యుడు ధర్మపురి శుక్రవారం రాత్రి కిడ్నాప్నకు గురయ్యారు. మర్నాడు శనివారం ఆయన శవం ఆ ప్రాంతంలో కనిపించింది. ఈ హత్యకు ఎవరు పాల్పడింది, కారణాలేమిటి అనేవిషయాలు తెలియరాలేదు. అయితే నక్సలైట్లే ఈ ఘాతుకానికి పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు.