వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 15నుంచి రామాలయ నిర్మాణం

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్యః మార్చి 15 నుంచి అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామనివిశ్వహిందూ పరిషత్‌ ఆదివారం ప్రకటించింది. రామ మందిర నిర్మాణంలో వున్న అవరోధాలను తొలగించాల్సిందిగా ప్రధాని వాజ్‌పేయికి అవసరానికి మించే సమయం ఇచ్చామని రామ జన్మభూమి న్యాస్‌ అధ్యక్షుడు రామచంద్ర పరమహంస అన్నారు. మార్చి 12 వరకుఇంకా ఎదురు చూస్తామని అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే వర్క్‌ షాప్‌ నుంచి రామమందిర నిర్మాణానికి రూపొందించిన పిల్లర్లను స్థలానికి తరలిస్తామని ఆయన హెచ్చరించారు.

జ్యోతిష పండితుల సూచన మేరకు మార్చి 15 నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. 1989లోనే శిలాన్యాసం జరిగిందని రామమందిర నిర్మాణానికి ఇప్పటికే పుష్కరం పాటు వేచి వున్నామని పరమహంస అన్నారు. ఈవిలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడుఅశోక్‌ సింఘాల్‌ కూడా పాల్గొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X