వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫరాన్ మాలిక్ కు ఏడురోజుల రిమాండ్
న్యూఢిల్లీః కోల్ కత్తా లోని అమెరికా ఇన్ఫర్మేషన్సెంటర్ పై దాడి కేసులో దుబాయ్ లో అరెస్టు చేసి న్యూఢిల్లీ తీసుకువచ్చిన ఫరాన్ మాలిక్ ను ఢిల్లీ కోర్టు ఏడురోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు పంపింది. గుజరాత్, హర్యానాల్లో భారీమొత్తంలో ఆయుధాలుస్వాధీనం చేసుకున్న దరిమిలా ఫరాన్ ను కస్టడీకి పంపాల్సిందిగా సిబిఐ కోర్టును కోరింది. ఐఎస్ఐ వద్ద సుశిక్షితుడైన ఏజెంట్ గా భావిస్తున్న మాలిక్ కాడిమ్స్షీ కంపెనీ అధిపతి ప్రతాప్ రాయ్ బర్మన్, గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపార్ పారిఖ్ ల కిడ్నాప్ కేసుల్లో కూడా ప్రధాన నిందితుడు.
Comments
Story first published: Sunday, February 10, 2002, 23:53 [IST]