వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌ ను నమ్మేది కల్లః వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

భటిండాః అమెరికా జర్నలిస్టు కిడ్నాప్‌ వ్యవహారంలో భారత్‌ హస్తం వున్నదంటూ పాక్‌ సైనికాధ్యక్షుడు ముషారఫ్‌ వ్యాఖ్యానించడంపై ప్రధాని వాజ్‌పేయి తీవ్రంగా మండిపడ్డారు. తనపై నిందను మాపుకొనేందుకు భారత్‌ పై వేలు చూపించే ముషారఫ్‌ ను ఎవరూ నమ్మరని భటిండాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వాజ్‌పేయి విమర్శించారు. వాషింగ్టన్‌ పోస్ట్‌ కు ముషారఫ్‌ ఇంటర్వ్యూ ఇస్తూ అమెరికా జర్నలిస్టు కిడ్నాప్‌ లో భారత్‌ హస్తం వుందంటూ ఆరోపించారని, తన తప్పు కప్పుపుచ్చుకోవడానికి భారత్‌ పై ఆరోపణలు చేసే పాక్‌ ను ఎలా నమ్మాలని వాజ్‌పేయి అన్నారు.

కోల్‌ కతాలోని అమెరికా ఇన్ఫర్మేషన్‌సెంటర్‌ పై దాడి చేసిన వారికి కూడా పాక్‌ ఆశ్రయం ఇచ్చిందని వాజ్‌పేయి ఆరోపించారు. అయినప్పటికీ పాకిస్తాన్‌ తో సత్సంబంధాలుపెంపొందించు కొనేందుకు ప్రయత్నించమన్నారు. ప్రతిసారీ భారత్‌ ను వంచిచడంతో పాటు తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోని పాక్‌ తో ఎలా చర్చలు జరుపుతామని ఆయన ప్రశ్నించారు. వాజ్‌పేయి ఎన్నికల ప్రసంగాలన్నీ ఉగ్రవాదంపైనే ప్రధానంగా సాగడం ఆసక్తి కలిసిస్తున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X