బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధం

హైదరాబాద్‌ః రాష్ట్ర శాసన సభ బడ్జెట్‌ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశాలు వచ్చే నెల 31 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 21న ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం బడ్జెట్‌ ముసాయిదాను ముందుగానే ప్రజల్లోకి చర్చకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రజలనుంచి అందిన సూచనలు, సలహాలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో సవరణలు వుండే అవకాశం వున్నదని అంటున్నారు.

ఈ సమావేశాల్లో 18 రోజుల పాటు వివిధ శాఖల పద్దులపై చర్చ జరుగుతుంది. సభను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగం పై మూడు రోజుల పాటు చర్చ జరుగుతుంది.బడ్జెట్‌పై ఆరురోజులపాటు చర్చ జరుగుతుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలకు మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ వచ్చిందని అయితేస్పీకర్‌ తిరస్కరించారని యనమల చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+