ఆంధ్రా కాంగ్రెస్‌ ఆత్మావలోకనం

హైదరాబాద్‌ః పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశం గురువారం గాంధీభవన్‌ లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో సి.ఎల్‌.పి. నాయకుడు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి,ఎ.ఐ.సి.సి. సభ్యురాలు సరోజినీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీని కుదిపివేస్తున్న క్రమశిక్షణ సమస్య ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం కాగలదని భావిస్తున్నారు.

అదే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంవిద్యుత్‌ చార్జీలను మరోసారి పెంచే ఆలోచన చేస్తున్నందున కాంగ్రెస్‌ సారధ్యంలో ఉద్యమం చేపట్టేఅంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల జరిగినమినీ మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పనితీరు గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+