అసెంబ్లీలో పవర్‌ కట్‌ -విపక్షం గగ్గోలు

హైదరాబాద్‌ః అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున గవర్నర్‌ సభనుద్దేశించి ప్రసంగిస్తుండగా హఠాత్తుగా కరెంట్‌ పోవడంతో సభలో గగ్గోలు లేచింది. సాక్షాత్తూ గవర్నర్‌ ప్రసంగిస్తుండగా అందులోనూ వచ్చే జులై నుంచి కరెంట్‌ కోత వుండదని చెప్పడానికి కొద్ది సెకండ్ల ముందే పవర్‌ కట్‌ కావడం విశేషం. గవర్నర్‌ మైక్‌ హఠాత్తుగా మూగపోవడంతో సభ్యులంతా బిత్తరపోయారు. దాదాపు 30 సెకండ్లపాటు సభఅంధకారంలో వుంది. కాంగ్రెస్‌ సభ్యులంతా సిఎం షేమ్‌, సిఎం షేమ్‌ అని అరిచారు. కరెంట్‌ రాగానే ప్రసంగం కొనసాగించిన గవర్నర్‌ క్యాలిటీ పవర్‌ గురించి ప్రస్తావించగానే సభ్యులు మరోసారి షేమ్‌, షేమ్‌ అంటూ అరిచారు.

గవర్నర్‌ ప్రసంగం సమయంలో పవర్‌ పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఇబ్బందికి గురయ్యారు. వెనక వరసలో కూచున్నవిద్యుత్‌ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుని వంక ఆయనసీరియస్‌గా చూడ్డం కనిపించింది. సుబ్బారాయుడు వెంటనే లేచి సభ బయటకు వెళ్లారు.విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏమీ లేదనిట్రాన్స్‌కో, డిస్ట్రూబ్యూషన్‌ కంపెనీల పొరపాటు ఇందులో ఏమీ లేదని సుబ్బారాయుడువివరణ ఇచ్చారు. అంతర్గతంగా సభాభవనంలోనేవిద్యుత్‌ సరఫరా వ్యవస్థలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగివుంటుందని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.విద్యుత్‌ శాఖ సీనియర్‌ అధికారి కుట్టిని విచారణ జరపాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు. అయితే సాయంత్రం వరకు ఎందుకిలా జరిగిందో మాత్రంవిద్యుత్‌ శాఖ అధికారులు కనిపెట్టలేకపోయారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+