తొలి విడత: యుపిలోకమలం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్‌ అనంతరం వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి కొంత ఊరట కలిగించే విధంగా వున్నాయి. మొత్తం 403అసెంబ్లీలో సీట్లలో తొలి విడత 92 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ 92 స్థానాల్లో అత్యధిక స్థానాలు బిజెపి గెల్చుకుంటుందని ఎగ్జిట్‌ పోల్‌అంచనాలు.

ఉత్తరాంచల్‌లో త్రిశంకు సభ ఏర్పడుతుందని, మణిపూర్‌లో కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు గెల్చుకుంటుందని నాలుగు టీవీ చానళ్లు, దూరదర్శన్‌-పి ఫోర్‌, ఆజ్‌తక్‌-సి ఓటర్‌, సహారా- ఆర్‌డిఐ, జీటీవి- సిఎంఎస్‌ నిర్వహించినసర్వేలు తేల్చాయి. ఉత్తరప్రదేశ్‌లో గురువారం పోలింగ్‌ జరిగిన 92సీట్లకు గాను బిజెపి కూటమికి 42 స్థానాలు వస్తాయని దూరదర్శన్‌, 46 వస్తాయని జీటీవీఅంచనా వేశాయి. బిజెపికి 37 వస్తాయని ఆజ్‌తక్‌, 38 వస్తాయని సహారా తేల్చాయి. గతఅసెంబ్లీ ఎన్నికల్లో ఈ 92 సీట్లలో బిజెపి 42 స్థానాలు గెల్చుకుంది. బిఎస్‌పికి 16 స్థానాలు దక్కవచ్చునని దూరదర్శన్‌, జీటీవీ చెప్పగా 27 రావచ్చునని ఆజ్‌తక్‌, 20 వస్తాయని సహారా చెప్పాయి.

70 సీట్లున్న ఉత్తరాంచల్‌లో బిజెపికి 34 స్థానాలు, కాంగ్రెస్‌కు 25 వస్తాయని జీ-సిఎంఎస్‌సర్వే తేల్చగా, 33 బిజెపి, 24 కాంగ్రెస్‌కు రావచ్చునని ఆజ్‌తక్‌ తేల్చింది. దూరదర్శన్‌ ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం కాంగ్రెస్‌కు 33సీట్లు వస్తాయని, బిజెపికి 27 సీట్లు వస్తాయని చెప్పింది. ఆరుసీట్లు ఉత్తరాఖండ్‌ క్రాంతిదళ్‌కు, మిగతావి ఇతరులకు వస్తాయని అభిప్రాయపడింది.

అరవై స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీలో 40 స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరిగింది. ఇందులో కాంగ్రెస్‌కు 20 స్థానాలు దక్కుతాయనిఅంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+