వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపురానపై అసెంబ్లీలో రభస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః మహిళాశిశు సంక్షేమ సంస్థ సారధి త్రిపురాన వెంకటరత్నంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. మహిళాశిశు సంక్షేమ సంఘం పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదని మిత్రపక్షమైన బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. త్రిపురాన వెంకటరత్నం బోర్డు నిధులు నాలుగు కోట్ల రూపాయలను ఓ ప్రైవేటు బ్యాంక్‌ లో డిపాజిట్‌ చేస్తే అదికాస్తా బోర్డు తిప్పేసింది. ఇదే కాక పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. పదవీ కాలం పూర్తయినప్పటికీ త్రిపురాన వెంకటరత్నం ఆ పదవి నుంచి తప్పుకొనేందుకు ససేమిరా అన్నారు.

చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుస్వయంగా చెప్పినా త్రిపురాన మొండికేసి కుర్చీకి అతుక్కుపోయారనే ఆరోపణలున్నాయి. అక్రమాల ఆరోపణలపైవిచారణ జరుగుతున్నదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిసరస్వతి సభలో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X